వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు అమ్ముడుపోయిన కృష్ణమాదిగ

By Staff
|
Google Oneindia TeluguNews

హుజూరాబాద్‌: మందకృష్ణ మాదిగ కాంగ్రెస్‌కు అమ్ముడుపోయి అమాయక మాదిగల్ని మోసం చేస్తున్నాడని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ అన్నారు.అలాగే మందకృష్ణ స్వార్థపరుడు, అవినీతిపరుడు,ఆయన వాల్‌ రైటింగ్‌ల ఖర్చు దాదాపు రూ. 10కోట్లు, ఆ నిధులు ఎవరు సమకూర్చారో తెలపాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి దళిత సంక్షేమంపట్ల చిత్తశుద్ధి లేదని, అగ్రకులాలకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను భూమి లేని నిరుపేద దళితుల ఇళ్ళకు ఎందుకు ఇవ్వట్లేదని కారెం శివాజీ ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇస్తున్నామనీ, అయితే దొరల తెలంగాణ మాత్రం వద్దన్నారు.

ఇక 13న సిఎం ఇల్లు ముట్టడి చేస్తానని కారెం శివాజీ కరీంనగర్ లో తెలియచేసారు. ఎస్సీల (ఏబీసీడీ) వర్గీకరణ ప్రక్రియను ప్రభుత్వం వెంటనే రద్దుచేయాలని కారెం శివాజీ కోరారు. అలాగే మందకృష్ణ మాదిగ బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు ప్రభుత్వం తలొగ్గి సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించి ఉషా మెహ్రా కమిషన్‌ వేయడం సరైంది కాదని ఆయన అన్నారు. దీన్ని నిరసిస్తూ ఈ నెల 13న లక్ష మందితో సీఎం ఇంటిని ముట్టడిస్తామని ఆయన ఇక్కడ మీడియాతో తెలిపారు. సోమవారం కరీంనగర్‌ ప్రెస్‌భవన్‌లో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌, టీడీపీ అధినేత చంద్రబాబులు ఇద్దరూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X