ఇంజినీరింగ్ విద్యార్థినులపై యాసిడ్ దాడి
వరంగల్ : వరంగల్లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థినులపై గుర్తు తెలియని దుండగులు యాసిడ్తో దాడిచేశారు. ప్రణీత ,స్నప్నిక అనే వీరిద్దరూ హసన్పర్తిలోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో చదువుతున్నారు. ఇక యాసిడ్ దాడి అనంతరం దుండగులు పరారయ్యారు. వారిద్దరూకూ తీవ్రగాయాలయ్యాయి. కళాశాలలో ఈ సంఘటన జరగడంతో విద్యార్థులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. గాయపడిన ఇద్దరినీ వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications