వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫెడరల్ ఏజెన్సీని ప్రతిపాదించిన చిదంబరం

By Staff
|
Google Oneindia TeluguNews

P Chidambaram
న్యూఢిల్లీ: భారతదేశంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఫెడరల్ ఏజెన్సీని పార్లమెంటులో ప్రతిపాదించారు. భద్రతా చర్యలను పటిష్టపరచడానికి త్వరలో ప్రభుత్వం కొన్ని బిల్లులను ప్రతిపాదిస్తుందని ఆయన చెప్పారు. గురువారం పార్లమెంట్‌ సమావేశాల్లో ముంబయి ఘటనపై కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన చేశారు. ముంబయిలో జరిగిన తీవ్రవాదదాడులు అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. మృతులకు ఘనంగా నివాళులు అర్పించారు. దాడులను సమర్థంగా ఎదుర్కొని ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన ఎన్‌ఎస్‌జీ కమెండోలను ఆయన ప్రశంసించారు.

ముంబై దాడుల్లో 10మంది ఉగ్రవాదులు పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈ సంఘటనద్వారా యావత్తు దక్షిణాసియాకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని భయాందోళన నెలకొందన్నారు. అయితే దేశభద్రతలో, ప్రజల రక్షణలో ఎలాంటి రాజీ లేదని, ఉగ్రవాదులను శిక్షించేందుకు, వారిని , వారిని ప్రోత్సహిస్తున్న వారిని అంతర్జాతీయ సమాజంలో దోషులుగా నిలబెట్టటంలో, అన్ని దేశాల మద్దతు పొందటంలో భారత్‌ సఫలమైందని చిదంబరం అన్నారు. తీరప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేస్తామని, ఇంటలిజెన్స్‌ వర్గాలను మరింత పటిష్టం చేస్తామని, ఖాళీలను భర్తీ చేస్తామని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X