యాసిడ్ కేసు: శ్రీనివాస్ ఒప్పుకోలు
వరంగల్: వరంగల్లులో ఇంజనీరింగ్ విద్యార్థులు స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడికి పాల్పడిన కేసులో శ్రీనివాస్ ను, అతని స్నేహితులు సంజయ్, హరికృష్ణలను నిందితులుగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులోనిర్థారించారు. ప్రధాన నిందితుడు శ్రీనివాస్ తానే ఈ నేరానికి పాల్పడినట్లు అంగీకరించాడు. ఇందులో తనకు సహకరించిన స్నేహితుల పేర్లను అతను చెప్పాడు. దీంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు కూడా నేరాన్ని అంగీకరించారు. ఈ సంఘటనలో రాష్ట్ర ప్రభుత్వం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను సస్పెండు చేసింది.
కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు స్పప్నిక, ప్రణీతలు టూవీలరుపై కాలేజీ నుంచి వస్తుండగా వారిపై యాసిడ్ పోసి శ్రీనివాస్, మరో ఇద్దరు పారిపోయారు. శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రస్తుతం స్పప్నిక హైదరాబాదులోని ఒక ప్రైవేట్ అస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రేమించలేదనే కక్షతో శ్రీనివాస్ తన స్నేహితుల సహకారంతో స్వప్నికపై యాసిడ్ పోశాడు.