వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాదగిరి గుట్టలో చిరు పూజలు

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి గురువారంనాడు నల్లగొండ జిల్లాలోని యాదగిరి గుట్టకు చేరుకున్నారు. యాదగిరి గుట్టలో జరిగే ప్రజా అంకిత సభ ఆయన ప్రసంగిస్తారు. ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. అయితే చిరంజీవి తన ప్రత్యేక వాహనం మీంచే ప్రసంగిస్తారు. ఆయన సతీసమేతంగా యాదగిరి గుట్టకు చేరుకుని లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంతకు ముందు ఆయన మార్గమధ్యలో ఘట్కేసర్ సమీపంలోని హంసాపూర్ దర్గాలో కూడా ప్రత్యేక పూజలు చేశారు. ఆయన గురువారంనాడు యాదగిరి గుట్ట, భువనగిరి, నక్రేకల్ సభల్లో ప్రసంగిస్తారు. రాష్ట్ర హైకోర్టు రోడ్ షోలను నిషేధించడంతో ఆయన బహిరంగ సభల్లో మాత్రమే పాల్గొంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X