వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుష్ పైకి బూట్లకు రూ. 50 కోట్లు

By Staff
|
Google Oneindia TeluguNews

George Bush
బగ్దాద్: మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ పైకి ఒక ఇరాకై జర్నలిస్టు విసిరిన బూట్లకు 50 కోట్ల రూపాయల విలువ పలికింది. బుష్ పైకి బూట్లు విసిరిన ఇరాకీ జర్నలిస్టు ముంతాజర్ అల్ - జైదీ రాత్రికి రాత్రి అరబ్ ప్రపంచంలో హీరో అయ్యారు. ఆ బూట్లను కొనడానికి ముందుకు వచ్చిన రిటైర్డ్ స్కూల్ టీచర్, వ్యాపారి మొహమ్మద్ మఖాఫా - వాటిని స్వేచ్ఛా మెడల్ గా భావిస్తున్నానని, తన వస్తువులన్నింటిలోకి అవి విలువైనవని అన్నట్లు ఆల్ జజీరా న్యూస్ చానెల్ వార్తా కథనాన్ని ప్రచురించింది.

తాను ఆ బూట్లను వాణిజ్య దృష్టితో చూడడం లేదని ఆయన చెప్పారు. తనకు అమెరికా పట్ల ద్వేషం లేదని, ముస్లింలను వేధిస్తున్న విదేశీ విధానాలను మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానని ఆయన అన్నారు. ఈ బూట్ల వేలంలో గిరిజనులు, ప్రముఖులు వేలంలో పాల్గొనడానికి ఇంటర్నెట్లో ఆసక్తి కనబరిచినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X