వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ చర్యలు తీసుకోవాల్సిందే: ప్రణబ్
కోల్ కత్తా: ముంబయిపై దాడులకు పాల్పడిన ఉగ్రవాదమూకలపై పాక్ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగమంత్రి ప్రణమబ్ముఖర్జీ డిమాండ్ చేశారు. పాక్ ఉగ్రవాద బృందాలపై ప్రమేయంపై ఇప్పటికే అన్నీ సాక్ష్యాధారాలను పాక్ సర్కారకు అందజేశామని ఆయన తెలిపారు. అయితే దీనిపై పాక్ప్రభుత్వం పరస్పర విరుద్ధంగా ప్రకటనలు చేయడాన్ని ఆయన ఖండించారు.
ఖండించడానికి, విరోధించడానికి బదులు పాకిస్థాన్ చర్యలు చేపట్టడం మంచిదని ఆయన అన్నారు. పాక్ చేస్తున్న ప్రకటనలు నమ్మ శక్యం కాకుండా ఉన్నాయని ఆయన అన్నారు. పాకిస్థాన్ నుంచే ఉగ్రవాదులు పని చేస్తున్నందున చర్యలు తీసుకోవాల్సింది ఆ దేశమేనని ఆయన అన్నారు. తాను పాకిస్థాన్ ప్రభుత్వం అనే మాట వాడలేదని, పాకిస్థాన్ లోని కొన్ని శక్తులు అని మాత్రమే అంటున్నానని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, December 22, 2008, 11:34 [IST]