నేడూ ఏసీబీ దాడులు, అధికారుల దడ
హైదరాబాద్: రాష్ట్రంలో ఏసీబీ అధికారులు పలు శాఖల అధికారులపై వరుసదాడులు కొనసాగిస్తున్నారు. వీరి దాడులు అధికారుల్లో కలవరం సృష్టిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎసిబి దాడులు ముమ్మరమయ్యాయి. తాజాగా ఈరోజు మూడు జిల్లాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నెల్లూరులో నీటిపారుదల శాఖ డీఈ గోవిందరెడ్డి నివాసాలపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆయనకు చెందిన మూడు ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. తిరుపతిలో విద్యాశాఖాధికారి నాగరాజు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. కర్నూలు జిల్లాలో శ్రీశైలం ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంటిపై దాడులు చేశారు.
Comments
Story first published: Wednesday, December 24, 2008, 10:28 [IST]