శవమై తేలిన ఐదేళ్ళ చిన్నారి
హైదరాబాద్: రాజేంద్రనగర్ ప్రాంతంలో అపహరణకు గురైన ఓ చిన్నారి శవమై తేలిన సంఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. బద్వేల్ ప్రాంతంలో ఈనెల 16న అసీమా అనే 5ఏళ్ల బాలిక అపహరణకు గురైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు స్ధానికంగా ఉన్న ఓ బావిలో బాలిక శవమై కనిపించింది. 16 వ తేదీన అసీమా తల్లితో కలిసి మెడికల్ షాపునకు వెళ్ళినట్టు తండ్రి చెప్పాడు. అక్కడ అసీమా తప్పిపోవడంతో మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన చెప్పాడు. అసీమా తండ్రి టైలర్ గా పనిచేస్తున్నాడు.
Story first published: Wednesday, December 24, 2008, 12:44 [IST]