బానిసత్వం కావాలా? పవన్‌

Pawan Kalyan
కరీంనగర్‌: ప్రజల గుండె చప్పుడు నుంచి వచ్చిన ప్రజారాజ్యం పార్టీ కావాలో లేదా దోపిడి దొంగల ప్రభుత్వం కావాలో తేల్చుకోవలసిన సమయం వచ్చిందని యువరాజ్యం అధినేత పవన్‌ పిలుపునిచ్చారు.తెలంగాణ కరీంనగర్‌ జిల్లా జరుగుతున్న ఆయన పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా అవినీతితో రాజకీయాలు భ్రష్టు పట్టాయని, దీన్ని అంతం చేయకపోతే మనకు బానిస బతుకేనని ఆయన తెలిపారు. ఈ రోజు పవన్‌ తిమ్మాపూరు, చిగురుమామిడి, హుస్నాబాద్‌, కమలాపూర్‌, ఎల్కతుర్తి, జమ్మికుంట్లలో పర్యటిస్తున్నారు.

పవన్ కల్యాణ్ రోడ్ షోలకు నిన్నటి కంటే జనం పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఆయన ప్రసంగాల్లో వాడి, వేడి అధికంగా ఉండడంతో అభిమానులే కాకుండా సామాన్యులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రాజకీయ పరిపక్వత గల ఈ జిల్లాలో ఉపన్యాసాల ద్వారా ప్రజలను ఆకట్టుకోవడం అంత సులభం కాదు. పవన్ కల్యాణ్ ఆ దిశగా విజయం సాధించినట్టే లెక్క.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+