హైదరాబాద్ లో దొంగల ముఠా అరెస్ట్
హైదరాబాద్: దొంగతనం కేసులో 8 మందిని సౌత్జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన నలుగురు వ్యక్తులు నగరంలో బట్టలు అమ్ముకునేందుకు వచ్చి అఫ్జల్ గంజ్ గాంధీ లాడ్జిలో నివాసం ఉంటున్నారు. నగరంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఆ లాడ్జిపై సోదాలు నిర్వహించారు. 8 మంది వ్యక్తులను అనుమానితులుగా గుర్తించారు. వీరినుంచి లక్షా 60 వేల రూపాయలను రికవరీ చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
Comments
Story first published: Tuesday, February 24, 2009, 15:45 [IST]