సురేందర్ మృతికి వైఎస్సే ..మంద కృష్ణ
ఎస్సీ వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని గత కొద్దిరోజులుగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరసనల పేరిట దాడులకు పాల్పడుతోంది. దీనిలో భాగంగా శనివారం గాంధీభవన్లో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సృష్టించిన విధ్వంసాన్ని సృష్టించిన ఘటనలో గాయపడి ఇమేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆదివారం ఉదయం సురేందర్ మాదిగ మృతి చెందారు. ఈ నేపథ్యంలో దామోదర్ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.సురేందర్ మృతి పట్ల ఆసుపత్రిలో బంధువుల రోదనలు మిన్నంటాయి.
Story first published: Sunday, March 1, 2009, 13:40 [IST]