ముస్లింలను వైయస్ ఊచకోత: చిరంజీవి

గురువారం హైదరాబాద్లోని దారుషిఫా వద్ద జరిగిన ముస్లింల సామాజిక న్యాయసదస్సులో చిరంజీవి సీఎం వైఎస్, టీడీపీ అధినేత చంద్రబాబులపై విమర్శల వర్షం కురిపించారు. ఆదిలాబాద్ జిల్లా భైంసా, వటోలిలో గొడవలు జరుగుతాయని తెలిసీనప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని నిప్పులు చెరిగారు.ఒక ముస్లిం కుటుంబాన్ని సజీవ దహనం చేస్తే ఇంత వరకు నిజాలు నిగ్గుతేల్చలేదని విమర్శించారు. బాబ్రీ మసీదు కూలగొడుతుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుందన్నారు. అధికారం కోసం ముస్లింలను వినియోగించుకొని, అధికారంలోకి రాగానే టీడీపీ ఎన్డీఏతో పొత్తుపెట్టుకుందని, గుజరాత్ మారణకాండలో వేలాది మంది ముస్లింలు చనిపోతే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిందని ధ్వజమెత్తారు.
అందుకే గత ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాము సూడో సెక్యులరిస్టులం కాదని వెల్లడించారు.రాష్ట్రంలో చరిత్రలో ఇప్పటి వరకు 396 మంది మంత్రులైతే, అందులో 24 మంది మాత్రమే ముస్లిం ఉన్నారని, ఇదేనా సామాజిక న్యాయం అంటూ టీడీపీ, కాంగ్రెస్లను నిలదీశారు. 'మీ భవిష్యత్తును నా చేతుల్లో పెట్టారు. మీకు మంచి చేసే అవకాశం అల్లా నాకిచ్చాడు' అని చెప్పారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications