చిరు ఉమ్మడి గుర్తుపై నేడే విచారణ
హైదరాబాద్: ఉమ్మడి గుర్తు కేటాయించాలంటూ ప్రజారాజ్యం పార్టీ వేసిన పిటీషన్పై హైకోర్టు ఈరోజు విచారణ జరపనుంది. ఈసారి తమ వాదనను బలంగా వినిపిస్తామని ఏది ఏమైనా ఉమ్మడి గుర్తుతోనే పోటీకి వెళతామని ప్రజారాజ్యం నేతలు తెలిపారు. ఇందుకు అనేక ప్రత్యామ్నాయాలు తాము సిద్ధంగా ఉంచుకున్నామని పార్టీ నేత సీతారాం తెలిపారు.
అభ్యర్ధులందరికీ ఒకే గుర్తు రాకపోతే ఎన్నికల్లో చాలా నష్టం జరుగుతుందని ప్రజారాజ్యం జిల్లా నాయకులు ఆందోళన చెందుతున్నారు. చిరంజీవి పార్టీని ప్రకటించిన వెంటనే ఎన్నికల నిబంధనలు తెలిసిన నిపుణులను కన్సల్టెంట్లుగా పెట్టుకుంటే ఈ తిప్పలు వచ్చేవి కావని, ఈ విషయంలో ప్రజారాజ్యం అగ్ర నాయకులు అతి విశ్వాసంతో వ్యవహరించి ఇప్పుడు ఆందోళన చెందుతున్నారని ఆంతరంగికులు బాహాటంగానే అంటున్నారు.
Comments
Story first published: Monday, March 16, 2009, 11:35 [IST]