హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రంలో అన్ని స్ధానాలకూ బీఎస్పీ...

By Staff
|
Google Oneindia TeluguNews

Mayawati
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ లోని అన్ని లోక్‌ సభ, అసెంబ్లీ స్థానాల నుంచి బహుజన్‌ సమాజ్‌ పార్టీ పోటీలో ఉంటుందని ఆ పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు. ఇక్కడి నిజాం కళాశాల మైదానంలో జరిగిన సభలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. సీట్ల కేటాయింపులో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు. ఈ రాష్ట్రంలో స్వాతంత్రానంతరం నుంచి కేంద్ర, రాష్ట్రాల్లో ఎక్కువ కాలం కాంగ్రెస్‌ పార్ర్టీయే పాలించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. వీరి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, వెనుకబడిన వర్గాలవారు అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు.

60 ఏళ్ల కాలంలో బీద వర్గాలకు న్యాయం జరుగలేదన్నారు. దేశంలో రైతులు, కూలీలు, వ్యాపారులు, అన్ని వర్గాలవారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రస్తుతం ఉన్న పరిస్థితికి కాంగ్రెస్‌, భాజపాలే కారణమని అన్నారు. నక్సలిజం సమస్య పెరగడానికి పేదరికం, నిరుద్యోగమే కారణమని మాయవతి అన్నారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపా, ఇతర అనుబంధ పార్టీలకు కాకుండా బీఎస్పీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X