నర్సాపురం నుంచి కూడా చిరు పోటీ?
కొత్తపల్లి సుబ్బారాయుడిని నరసాపురం లోక్ సభ స్థానం నుంచి నిలబెట్టాలని పార్టీ ప్రతిపాదించగా అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. అసెంబ్లీకే పోటీ చేస్తానని తన అభిప్రాయాన్ని తెలిపారని తెలిసింది. నరసాపురం లోక్సభ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎమ్మెల్సీ కనుమూరి బాపిరాజును తమ అభ్యర్థిగా ప్రకటించినందున, అదే కులానికి చెందిన వ్యక్తికే అభ్యర్థిత్వం ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కృష్ణంరాజు ప్రజారాజ్యం పార్టీలో ఇంకా చేరలేదు. ఆయన టిడిపిలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదు.
Comments
Story first published: Monday, March 23, 2009, 11:02 [IST]