వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరణ్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన కోర్టు

By Staff
|
Google Oneindia TeluguNews

అలహాబాద్: ముస్లింలకు వ్యతిరేకంగా ప్రసంగించినందుకు ఫిలిభిత్ లో తనపై నమోదైన ఎఫ్ ఐఆర్ ను కొట్టేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి వరుణ్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. వరుణ్ గాంధీపై ఈ నెల 17వ తేదీన బార్ఖేడా పోలీసు స్టేషనులో ఎఫ్ ఐఆర్ నమోదైంది. ఆయన ప్రసంగం చేసిన 9 రోజుల తర్వాత ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసు నమోదైందని వరుణ్ గాంధీ వాదించారు.

తన సెక్యులర్ ఇమేజ్ ను, తన రాజకీయ ప్రస్థానాన్ని దెబ్బ తీయడానికి ఆ కేసు నమోదు చేశారని ఆయన విమర్శించారు. తన బహిరంగ సభ ప్రసంగాన్ని తారుమారు చేర్చి సిడిని రూపొందించారని, వీడియోలో ఉన్న మాటలు పూర్తిగా తనవి కావని, అందులోని గొంతు కూడా తనది కాదని, ఆ సిడి ఆధారంగా ఎన్నికల కమిషన్ తనపై చర్య తీసుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X