వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరణ్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన కోర్టు
అలహాబాద్: ముస్లింలకు వ్యతిరేకంగా ప్రసంగించినందుకు ఫిలిభిత్ లో తనపై నమోదైన ఎఫ్ ఐఆర్ ను కొట్టేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి వరుణ్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. వరుణ్ గాంధీపై ఈ నెల 17వ తేదీన బార్ఖేడా పోలీసు స్టేషనులో ఎఫ్ ఐఆర్ నమోదైంది. ఆయన ప్రసంగం చేసిన 9 రోజుల తర్వాత ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసు నమోదైందని వరుణ్ గాంధీ వాదించారు.
తన సెక్యులర్ ఇమేజ్ ను, తన రాజకీయ ప్రస్థానాన్ని దెబ్బ తీయడానికి ఆ కేసు నమోదు చేశారని ఆయన విమర్శించారు. తన బహిరంగ సభ ప్రసంగాన్ని తారుమారు చేర్చి సిడిని రూపొందించారని, వీడియోలో ఉన్న మాటలు పూర్తిగా తనవి కావని, అందులోని గొంతు కూడా తనది కాదని, ఆ సిడి ఆధారంగా ఎన్నికల కమిషన్ తనపై చర్య తీసుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు.
Comments
Story first published: Wednesday, March 25, 2009, 12:02 [IST]