ఎన్టీఆర్ అలక, బాబు బేజార్!
కృష్ణాజిల్లాలోని గుడివాడ, గన్నవరం టికెట్లను తన వాళ్ళకు ఇప్పించుకోవాలని ఎన్టీఆర్ లక్ష్యం. ఆ విషయంలో హామీ తీసుకున్న తర్వాతే జూనియర్ తన రథం మీద ప్రచారానికి బయలుదేరారు. గుడివాడ నుంచి సిటింగ్ ఎమ్మెల్ల్యే కొడాలి నానికి టికెట్ ఇచ్చినా గన్నవరం విషయంలో పేచీ వచ్చింది.
ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి వీపు మీద ఒక కొరడా దెబ్బ వేసిన సౌండ్ ఎఫెక్ట్ ఇచ్చినట్టు తెలిసింది. "మీరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నా శ్రేయోభిలాషి డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఏప్రిల్ 4 న నామిషన్ వేస్తున్నారు. మీరు వంశీమోహన్ కు టికెట్ ఇవ్వని పక్షంలో నేను కావాలో, దాసరి బాలవర్ధనరావుకు టికెట్ కావాలని కోరుతున్నవారు కావాలో (నందమూరి తారకరత్న మొదలైనవారు) తేల్చుకోవాలి" అని జూనియర్ చాలా సీనియర్ లా మాట్లాడేసరికి చంద్రబాబు నాయుడికి గుడ్లు తేలేయక తప్పని పరిస్ధితి ఏర్పడింది. జూనియర్ ఈ దశలో రోడ్ షోలను విరమించుకుని వస్తే తాను రోడ్ల మీదికి రాక తప్పదని తెలుసుకున్న చంద్రబాబు ఆయన కోరిన ప్రకారం వంశీమోహన్ కు టికెట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.