బాబుతో హీరో కృష్ణ మంతనాలు!
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి కృష్ణ గుడ్బై చెప్పనున్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్నాయి. తన సోదరుడు ఆదిశేషగిరిరావుకు లోక్సభ సీటు కేటాయించకపోవడంతో కినుక వహించిన ఆయన, వైఎస్ నచ్చజెప్పడంతో కాస్త వెనక్కుతగ్గారు. అయితే తాజా రాష్ట్ర రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కృష్ణ తన మనసు మార్చుకున్నట్లు సమాచారం. దీనితో, చంద్రబాబుతో కృష్ణ తన సోదరునికి లోక్సభ సీటు కేటాయించే విషయమై మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. అదేవిధంగా విజయనిర్మలకు కైకలూరు సీటు కోరుతున్నట్లుగానూ సమాచారం. ముందు నుంచీ కృష్ణ చేరిక పట్ల ఆసక్తి చూపుతున్న తెలుగుదేశం పార్టీ వీరి కుటుంబానికి రెండు సీట్లు ఇచ్చే విషయమై తీవ్రంగా ఆలోచిస్తున్నది. ఉOడవల్లికి చెక్ చెప్పేందుకు మురళీమోహన్ను జూబ్లిహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి రాజమండ్రి లోక్సభ స్థానానికి బలవంతంగా ఒప్పించిన చంద్రబాబు, ఇప్పుడు ఆ స్థానాన్ని ఆదిశేషగిరిరావుకు కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అది వీలుకాకపోతే గుంటూరు లోక్సభ స్థానాన్ని కృష్ణ కుటుంబానికి ఇచ్చే పరిశీలన కూడా జరుగుతున్నది.
-
కేరళంలో 5 గ్యారంటీలను ప్రకటించిన రాహుల్ గాంధీ.. -
మహిళలను వేధిస్తే ఇక అంతే.. సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్ ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..!












Click it and Unblock the Notifications