బాబుతో హీరో కృష్ణ మంతనాలు!
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి కృష్ణ గుడ్బై చెప్పనున్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్నాయి. తన సోదరుడు ఆదిశేషగిరిరావుకు లోక్సభ సీటు కేటాయించకపోవడంతో కినుక వహించిన ఆయన, వైఎస్ నచ్చజెప్పడంతో కాస్త వెనక్కుతగ్గారు. అయితే తాజా రాష్ట్ర రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కృష్ణ తన మనసు మార్చుకున్నట్లు సమాచారం. దీనితో, చంద్రబాబుతో కృష్ణ తన సోదరునికి లోక్సభ సీటు కేటాయించే విషయమై మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. అదేవిధంగా విజయనిర్మలకు కైకలూరు సీటు కోరుతున్నట్లుగానూ సమాచారం. ముందు నుంచీ కృష్ణ చేరిక పట్ల ఆసక్తి చూపుతున్న తెలుగుదేశం పార్టీ వీరి కుటుంబానికి రెండు సీట్లు ఇచ్చే విషయమై తీవ్రంగా ఆలోచిస్తున్నది. ఉOడవల్లికి చెక్ చెప్పేందుకు మురళీమోహన్ను జూబ్లిహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి రాజమండ్రి లోక్సభ స్థానానికి బలవంతంగా ఒప్పించిన చంద్రబాబు, ఇప్పుడు ఆ స్థానాన్ని ఆదిశేషగిరిరావుకు కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అది వీలుకాకపోతే గుంటూరు లోక్సభ స్థానాన్ని కృష్ణ కుటుంబానికి ఇచ్చే పరిశీలన కూడా జరుగుతున్నది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications