కాంగ్రెసుపై ప్రతీకారం: కెసిఆర్

K Chandrasekhar Rao
మహబూబ్ నగర్: తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఓడించడమే తమ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అన్నారు. మహబూబ్ నగర్ లోకసభ స్థానం నుంచి నామినేషన్ వేయడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. తెలంగాణను మోసం చేసిన కాంగ్రెసును ఓడించే ఉద్దేశంతో తాము మహా కూటమిలో చేరినట్లు ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. కాంగ్రెసు ఓడిపోతే తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని, అందుకే కాంగ్రెసును ఓడించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.

కాంగ్రెసు ద్రోహానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కెసిఆర్ తల నరుక్కుంటాడు తప్ప తల వంచడని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు విశ్రమించబోమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మహా కూటమి రోజురోజుకూ బలపడుతోందని ఆయన చెప్పారు. కృష్ణా నది జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా దక్కడం లేదని, దీంతో మహబూబ్ నగర్ జిల్లాకు నీరు అందడం లేదని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో కెసిఆర్ తో పాటు తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+