వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలయ్య మాట నిజమే: చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తాడేపల్లిగూడెం: తమ పార్టీ ప్రజల గుండెల్లోంచి వచ్చిన ప్రత్యేకమైన పార్టీ అని, ఎవరూ తమకు పోటీ కాదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన బుధవారం మీడియ ప్రతినిధులతో మాట్లాడారు. పీఆర్పీ తమకు పోటీకాదన్న బాలకృష్ణ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ చెప్పింది నిజమేనని, ప్రజల గురించి ఎన్నేళ్లయినా తెలుసుకోలేని తెలుగుదేశం పార్టీతో తమకేం పోటీ అని అన్నారు. తమ పార్టీ మేనిఫెస్టోను ఈనెల 5వ తేదీన విడుదల చేస్తామని ఈలోగా అభ్యర్థుల మరో జాబితాను విడుదల చేస్తామని అన్నారు. అందరికీ టిక్కెట్లు ఇవ్వలేమని గ్రహించి రెబల్స్‌ పోటీనుంచి తప్పుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఆయన రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెసు ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రజలను ఏమార్చడానికి పథకాలను చూపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తనను ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారని, వారికి సేవ చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X