వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు రైలింజన్ కు కోర్టు చిక్కులు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
న్యూఢిల్లీ: చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీకి ఎన్నికల సంఘం రైలింజన్ గుర్తును కేటాయించడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ గుర్తు తమకే కేటాయించాలని కోరుతూ రాష్ట్రీయ క్రాంతికార్ సమాజ్ వాదీ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతంలో తాము ఆ గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేశామని, అందువల్ల ఆ గుర్తును తమకు కేటాయించడం న్యాయమని ఆ పార్టీ వాదిస్తోంది.

తమది గుర్తింపు పొందిన పార్టీ కాదని, అలాగే ప్రజారాజ్యం పార్టీకి కూడా గుర్తింపు లేదని, అందువల్ల ఆ గుర్తును ఏ పార్టీకి కేటాయించాలనే విషయంపై లాటరీ వేసి నిర్ణయించడమైనా చేయాలని ఆ పార్టీ అంటోంది. తాము ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ లో కూడా పోటీ చేస్తున్నామని ఆ పార్టీ చెబుతోంది. రాష్ట్రీయ క్రాంతికార్ సమాజ్ వాదీ పార్టీ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణ జరిపింది. మలి విచారణ రేపు జరుగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X