విజయనగరం: విజయనగరం జిల్లాలో యువరాజ్యం అధినేత పవన్ కల్యాణ్ సభలు గందరగోళం మధ్య కొనసాగాయి. సమన్వయలోపంతో ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి ఏర్పడింది. ముందుగా నిర్ణయించిన సాలూరు టూర్ను సమయాభావంతో రద్దు చేసుకోవటంతో అభిమానులు ఆగ్రహించారు. రామభద్రపురంనుంచి బొబ్బిలి వెళ్లిపోతున్న పవన్ వాహనానికి అడ్డంగా పడుకుని వారు నిరసన వ్యక్తం చేశారు. బొబ్బిలి సభలో భారీగా తోపులాటలు జరగటంతో పవన్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. సాలూరు కార్యకర్తలు విషయం తెలిసి అక్కడకు కూడా వెళ్లి మాట్లాడారు. అక్కడ ఆయన ప్రసంగం ఆద్యంతం చప్పగా సాగటంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు.