రాజమండ్రి పీఅర్పీ ఆఫీసుకు తాళం
రాజమండ్రి: ప్రజారాజ్యం తుది జాబితా కూడా విడుదల కావటంతో వివిధ జిల్లాల్లో అసంతృప్తి జ్వాలలు రేగాయి. రాజమండ్రి నుంచి టిక్కెట్ ఆశించిన బొమ్మన రాజ్ కుమార్కు టిక్కెట్ ఇవ్వకుండా కృష్ణంరాజుకు ఇక్కడి నుంచి టిక్కెట్ ఇవ్వటంతో కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణంరాజు బస చేసిన హోటల్వద్ద నిరసన ప్రదర్శన చేసిన కార్యకర్తలు అనంతరం పీఆర్పీ కార్యాలయానికి తాళం వేశారు. రాజ్ కుమార్ రెబల్ అభ్యర్థిగా నిలుచుంటారని తెలుస్తోంది. ఇక్కడి నుంచి తెలుగుదేశం అభ్యర్ధిగా సినీనటుడు మురళీమోహన్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఉండవల్లి అరుణ్ కుమార్.












Click it and Unblock the Notifications