టీవీల్లో వైయస్ మాడు ముఖం: నారాయణ
వరంగల్: వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇచ్చే కలర్ టీవీల్లో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మాడిపోయిన ముఖం కనిపిస్తుందని సిపిఐ రాష్టర్ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. వరంగల్ జిల్లా హుస్నాబాద్ లో ఆయన ఎన్నికల ప్రచార సభలో గురువారం ప్రసంగించారు. చంద్రబాబు కలర్ టీవీల హామీపై కాంగ్రెసు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు.
నగదు బదిలీ పథకం అమలు సాధ్యమేనని, కలర్ టీవీలు ఇస్తే నిరుపేదలు రాజకీయ చైతన్యాన్ని పొందుతారని ఆయన అన్నారు. సాక్షిటీవీ లేని కాంగ్రెస్ అభివృద్ధిని భూతద్దంలో చూపిస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు నాయకులు లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, వాటితో 30 ఏళ్ల పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టవచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications