పరకాల రాజీనామా మామూలే: ఉపేంద్ర

చిరంజీవితో దశాబ్దాలుగా ఉన్న ఆయన అభిమానులకు కూడా టిక్కెట్లు రాలేదని, వారు చిరుకు విధేయంగానే ఉంటారని ఉపేంద్ర చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ కొత్తగా ఏర్పడిందని, రాష్ట్రంలో ఉన్నవి 294 స్థానాలేనని, వాటిని అందరికీ పంచడం సాధ్యం కాదని ఆయన అన్నారు. కొత్తగా ఏర్పడిన పార్టీ కాబట్టి ఎలా వెళ్లాలో తెలియకపోవచ్చునని, కొన్ని పద్ధతులు పాటించి ఉండకపోవచ్చునని, కానీ అంత మాత్రాన పార్టీలో ఎవరినో శంకించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
పార్టీ విషవృక్షమని పరకాల చేసిన వ్యాఖ్యను ప్రస్తావించగా అది తెలుసుకోవడానికి ఏడాది పట్టిందా అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. విజ్ఞులై వుంటే ఎన్నికల తర్వాత రాజీనామా చేసి ఉండేవారని ఆయన అన్నారు. రాజీనామాలు చేయడం రాజకీయాల్లో సాధారణమని ఆయన అన్నారు. చిరంజీవి ఆకర్షణ మీద ఆధారపడిన పార్టీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications