తొడలు కొడ్తామే గానీ..: బాలయ్య

పౌరుషానికి ప్రతీక అయిన బ్రహ్మనాయుడు పుట్టిన ప ల్నాటి గడ్డలో ప్రతి పౌరుడు అవినీతి కాంగ్రెస్ ను పారదోలేందుకు ఓటునే ఆయుధంగా మలచుకోవాలన్నారు.ప్రజారాజ్యం పార్టీకి ఓటేస్తే రైలింజన్ ప్రజల మీదికే దూసుకెళ్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పుచ్చుకోవడం, ఇచ్చుకోవడం, మెచ్చుకోవడం అనే మూడు సిద్ధాంతాలతో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు..జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం సాగుతోందని ఆయన అన్నారు. ప్రతి కార్యక్రమంలో కమిషన్లు తీసుకుంటున్నారని, వాటిలో కొంత మొత్తాన్ని ఢిల్లీ పెద్దలకు కాంగ్రెసు నాయకులు కొంత మొత్తం ఇచ్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications