29 కేంద్రాల్లో రీపోలింగ్
హైదరాబాద్: తొలి విడతలో పోలింగ్ నిలిచిపోయిన 29 కేంద్రాలలో శనివారం నాడు రీపోలింగ్ జరుగుతోంది. ఆయా కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. మహబూబ్ నగర్ -19, కరీంనగర్-1, హైదరాబాద్-2, వరంగల్-1, ఖమ్మం-2, శ్రీకాకుళంలోని మూడు పోలింగ్ కేంద్రాలలో శనివారం నాడు రీపోలింగ్ జరుగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని అయిజ పునర్విభజనలో అలంపూర్లో కలవడంతో అక్కడి ప్రజలు ఓటు వేయడానికి తిరస్కరించారు. దీనితో అక్కడ 17 కేంద్రాలలో పోలింగ్ నిలిచిపోయింది. అదేవిధంగా శ్రీకాకుళంలోని పలాసలో ఈవిఎం పనిచేయకపోవడంతో చీటిల ద్వారా ఓట్లు వేయించడంతో అక్కడ కూడా రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. మరికొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం, ఈవిఎంలు మొరాయించడంతో రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలియజేసింది.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications