ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దాసరిపై చిరంజీవి గుర్రు

By Staff
|
Google Oneindia TeluguNews

Dasari Naryana Rao
ఏలూరు: జై చిరంజీవ సినిమా వేడుకల్లో తనను అందరివాడు అని ప్రశంసించిన దర్శకుడు, కాంగ్రెసు నాయకుడు దాసరి నారాయణరావు అదే నోటితో చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. రాజకీయాలంటే ఎలా ఉంటాయో తెలుస్తోందని ఆయన సోమవారం పాలకొల్లులో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆయన పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు.

కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రచారం చేయటమంటే చిరంజీవిని విమర్శించటమేనా అని ఆయన దాసరి నారాయణరావును ప్రశ్నించారు. తాము ఓ కొత్త రాజకీయాన్ని ప్రజలకు అందించాలని, ఏ పార్టీ అమలుచేయని రాజకీయ సామాజిక న్యాయాన్ని అమలు చేయాలని వచ్చామని అన్నారు. విమర్శలు ఎన్ని వచ్చినా భయపడబోమని అన్నారు. ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ విపలమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X