వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి జెసి సోదరుడి వీరంగం

By Staff
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాష్ట్ర మంత్రి జెసి దివాకర్ రెడ్డి సోదరుడు జెసి ప్రభాకర రెడ్డి వీరంగం సృష్టించారు. కాంగ్రెసు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై, పార్టీ కార్యకర్తలపై శుక్రవారంనాడు దాడులు చేశారు. దీంతో తెలుగుదేశం కార్యకర్తులు ప్రతిదాడులు చేశారు. ఇరు పార్టీల కార్యకర్తల ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు గాల్లోకి కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది.

పోలింగ్‌కు ముందురోజు బుధవారం రాత్రే జెసి దివాకర్ రెడ్డి ప్రతాపం మొదలైంది. తెలుగుదేశం ఏజెంట్ల ఇళ్లకు వెళ్లిన మంత్రి జేసీ వారిని తెల్లవారి పోలింగ్‌ కేంద్రాల వద్దకు రావద్దని కోరారు. వారు ససేమిరా అనటంతో ఆగ్రహంతో వెళ్లిపోయారు. ఈసీ భయంతో నిన్నటికి ఆగిన ఆయన అనుచరులు శుక్రవారం రెచ్చిపోయారు. తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థి పేరం నాగిరెడ్డి, టీడీపీ ఏజెంట్ల ఇళ్లపై దాడులు చేశారు. అడ్డువచ్చిన వారిని చితకబాదారు. అడ్డువచ్చిన మీడియా ఛానళ్లవారిని కూడా కెమెరా తీయవద్దని బెదిరించారు. కెమెరాలు లాక్కున్నారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో తాడిపత్రిలో దుకాణాలు అన్నీ మూసివేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X