దర్శకుడు రామినీడు కన్నుమూత
చెన్నై: ప్రముఖ దర్శక నిర్మాత గుత్తా రామినీడు (82) బుధవారం చెన్నైలో కన్నుమూశారు. వృద్ధాప్యం వల్ల సంభవించిన అనారోగ్యంతో రామినీడు మృతి చెందినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రామినీడు మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పలువురు తెలుగుచలన చిత్ర ప్రముఖులు సైతం రామినీడు భౌతిక కాయాన్ని సందర్శించడానికి హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని చారెపర్రులో జన్మించిన రామినీడు చిన్నతనం లోనే సినిమాలకు ఆకర్షితులయ్యారు.
సినిమాల మీద ఆసక్తి కొద్దీ చెన్నై చేరుకుని అనతి కాలంలోనే ఆ రంగంలో పట్టు సాధించారు. 1954 మొదలుకొని ఇప్పటి వరకూ ఆయన ఎన్నో విజయ వంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొన్ని చిత్రాలను స్వయంగా నిర్మించారు కూడా. మా ఇంటి మహాలక్ష్మి (1959), చివరికి మిగిలేది (1960), పల్నాటి యుద్ధం (1966), భక్తపోతన (1966), బంగారు సంకెళ్ళు (1968), ప్రతీకారం (1982) వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. కుటుంబ కథా చిత్రాలకు ఆయన పెద్ద పీట వేశారు. ఆయన సినిమాలు ఆంతర్లీనంగా సందేశాన్ని అందిస్తూ వినోదాన్ని పంచుతాయి.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications