వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్ళీ మేమే: రాహుల్‌ గాంధీ

By Staff
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
న్యూఢిల్లీ: కేంద్రంలో మళ్లీ యూపీఏ ప్రభుత్వమే ఏర్పడుతుందని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేసారు. ఈ రోజు(మంగళవారం) ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తామని, ఈ ఎన్నికల్లో యూపీఏ విజయం సాధిస్తుందన్నారు.దేశాన్ని ముందుకు నడిపించే సత్తా కాంగ్రెస్‌ పార్టీకే ఉందని, యూపీఏ ప్రభుత్వం హయాంలో దేశం శరవేగంగా అభివృద్ధి చెందిందన్నారు. మన్మోహన్‌ సింగ్‌ పనితీరు అద్భుతంగా ఉందని, ఆయనే మా ప్రధాన మంత్రి అభ్యర్థి అని మరోసారి స్పష్టం చేశారు.

వామపక్షాలవి పాత సిద్దాంతాలే...వారు మార్పును స్వీకరించాలన్నారు. పొత్తుల కోసం తలుపులు ఎప్పుడు తెరచే ఉంటాయని, ఎన్నికల అనంతరం లెఫ్ట్‌ పార్టీలు తమకే మద్దతు ఇస్తాయని రాహుల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఎన్నికలతో సంబంధం లేని విషయాలను బీజేపీ తెరపైకి తెస్తోందని, ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్డీఏ గెలవదని భావిస్తున్నాయి, బీజేసీ దృష్టిలో మాత్రమే ఎన్డీఏ బ్రతికి ఉందని...దానికి కాలం చెల్లిందని ఎద్దేవా చేశారు.

ఇక ఎల్టీటీఈ గురించి మాట్లాడుతూ అది ఒక తీవ్రవాద సంస్థ...తమిళ పౌరులకే మా మద్దతు ఉంటుంది. అలాగే శ్రీలంక ప్రభుత్వం దూకుడు చర్యనే మేము వ్యతిరేకిస్తున్నాం అని రాహుల్‌ ప్రకటించారు. స్విస్‌ బ్యాంకుల్లోని నల్లధనాన్ని తప్పక వెనక్కి తీసుకొద్దాం అన్నారు. మన రాజకీయ వైఫల్యాల వల్లే నిధులు పూర్తి స్థాయిలో సద్వినియోగం కావడం లేదన్నారు. నిధులు గ్రామీణ ప్రాంతాలకు చేరడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువత దేశ రాజకీయాల గురించి ఆలోచించాలని కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X