మళ్ళీ మేమే: రాహుల్ గాంధీ
వామపక్షాలవి పాత సిద్దాంతాలే...వారు మార్పును స్వీకరించాలన్నారు. పొత్తుల కోసం తలుపులు ఎప్పుడు తెరచే ఉంటాయని, ఎన్నికల అనంతరం లెఫ్ట్ పార్టీలు తమకే మద్దతు ఇస్తాయని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఎన్నికలతో సంబంధం లేని విషయాలను బీజేపీ తెరపైకి తెస్తోందని, ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్డీఏ గెలవదని భావిస్తున్నాయి, బీజేసీ దృష్టిలో మాత్రమే ఎన్డీఏ బ్రతికి ఉందని...దానికి కాలం చెల్లిందని ఎద్దేవా చేశారు.
ఇక ఎల్టీటీఈ గురించి మాట్లాడుతూ అది ఒక తీవ్రవాద సంస్థ...తమిళ పౌరులకే మా మద్దతు ఉంటుంది. అలాగే శ్రీలంక ప్రభుత్వం దూకుడు చర్యనే మేము వ్యతిరేకిస్తున్నాం అని రాహుల్ ప్రకటించారు. స్విస్ బ్యాంకుల్లోని నల్లధనాన్ని తప్పక వెనక్కి తీసుకొద్దాం అన్నారు. మన రాజకీయ వైఫల్యాల వల్లే నిధులు పూర్తి స్థాయిలో సద్వినియోగం కావడం లేదన్నారు. నిధులు గ్రామీణ ప్రాంతాలకు చేరడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువత దేశ రాజకీయాల గురించి ఆలోచించాలని కోరారు.