స్వర్ణదేవాలయంలో కెసిఆర్ పూజలు
అమృతసర్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు సోమవారంనాడు స్వర్ణదేవాలయంలో పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఆయన మొక్కుకున్నట్లు చెబుతున్నారు. ఆయనతో పాటు ఇతర తెరాస నాయకులు వినోద్ కుమార్, కెటి రామారావు తదితరులు పూజలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం లూథియానాలో జరిగిన ఎన్డీయె ర్యాలీకి హాజరైన ఆయన రాత్రి అమృతసర్ లో బస చేశారు. సోమవారం నాడు స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు చేశారు. అయితే ఆయన మీడియాతో ఏమీ మాట్లాడలేదు.
తెలంగాణ రాష్ట్రం సాధ్యమైనంత త్వరగా రావాలని, పంజాబ్ రాష్ట్రం లాగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కెసిఆర్ ప్రార్థనలు చేసినట్లు పార్టీ నాయకులు చెప్పారు. తృతీయ కూటమి ఓ మిథ్య అని, దాని ద్వారా తెలంగాణ రాష్ట్ర రాదని తాము నమ్ముతున్నామని, అందుకే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పిన ఎన్డీయెతో కలిసి పని చేయడానికి సిద్ధపడుతున్నామని తెరాస పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ మీడియా ప్రతినిధులతో అన్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications