నితీష్ సెక్యులరిజం తేలిపోయింది: లాలూ
పాట్నా: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ఎన్డీయె ర్యాలీలో పాల్గొన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లౌకికవాదం ఏపాటిదో తేలిపోయిందని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడీ) నేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. నితీష్ కు కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ సెక్యులర్ సర్టిఫికెట్ ఇవ్వడంపై ఆయన ఈ వ్యాఖ్య చేశారు. రాంపూర్ లో ప్రచారం నిర్వహించి వచ్చిన ఆయన సోమవారం పాట్నా విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నితీష్ చాలా సంక్లిష్టమైన వ్యక్తి అని తాము మొదటి నుంచీ చెబుతూ వస్తున్నానని ఆయన గుర్తు చేశారు. నితీష్ కు అనుకూలంగా మాట్లాడిన రాహుల్ గాంధీ, ఇతరులు ఆ విషయాన్ని గుర్తించాలని ఆయన అన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో వేదికను పంచుకోబోనని ప్రకటించి నితీష్ కుమార్ ఢిల్లీలో జరిగిన ఎన్టీయె ర్యాలీలో పాల్గొనలేదని, బీహార్ లో ఎన్నికలు ముగియగానే తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారని, మోడీతో వేదికను పంచుకున్నారని ఆయన అన్నారు. మీడియా తనపై బురద జల్లే పనికి ఒడి గట్టిందని ఆయన విమర్శించారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications