దొంగతనంతో పేరుతో వ్యక్తికి నిప్పు
హైదరాబాద్: టీవీ దొంగిలించాడనే నెపంతో ఓ దాబా యజమాని అందులో పనిచేసే వ్యక్తిని పెట్రోలు పోసి కాల్చిన ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లిలో జరిగింది. కూకట్ పల్లిలోని ప్రగతినగర్ సమీపంలో హమ్ సఫర్ అనే దాబాను మూడురోజులుగా మూసివేశారు. ఆ సమయంలో అందులో ఉన్న టీవీని దొంగలు ఎత్తుకెళ్లారు.
టీవీని దాబాలో పనిచేసే రాఘవేంద్ర దొంగిలించాడనే అనుమానంతో అతనిపై యజమాని పెట్రోలు పోసి నిప్పంటించారు. అంతకు ముందు అతన్ని చిత్రహింసల పాలు చేశారు. దీంతో తీవ్ర గాయాల పాలయిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. 23 ఏళ్ల రాఘవేంద్ర వెనకబడిన మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చి ఈ దాబాలో పని చేస్తున్నాడు.
More From
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
వంటగ్యాస్ రేట్లు భారీగా పెరిగిన వేళ.. పెట్రోల్ ధరలు ఇలా!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెట్రోల్ బంకుల్లో కిరోసిన్ -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం..? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications