బెర్త్ ల గొడవలు: 28న విస్తరణ

Manmohan Singh
న్యూఢిల్లీ: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మంత్రి వర్గ విస్తరణ ఈ నెల28వ తేదీన జరిగే అవకాశం ఉంది. డిఎంకెకు, ఇతర యుపిఎ భాగస్వామ్య పక్షాలకు చెందినవారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో చర్చలు జరిపి గురువారం మంత్రి వర్గ విస్తరణ జరపాలని నిర్ణయించారు. కోర్ కమిటీ సమావేశానికి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ, కాంగ్రెసు రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మిత్రులకు ఇచ్చే మంత్రి పదవులపై ఆ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ తమకు ఎనిమిది మంత్రి పదవులు కావాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. వాటిలో ఒకటి క్యాబినెట్ మంత్రి పదవి కాగా మిగతా ఏడు సహాయ మంత్రి పదవులు కావాలని ఆమె కోరుతున్నారు. ఇప్పటికే ఏడు మంత్రి పదవులు ఇవ్వడానికి కాంగ్రెసు అంగీకరించింది.

తృణమూల్ కాంగ్రెసుతో సమస్యలు లేవని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఎన్సీపి నేత ప్రఫుల్ పటేల్ పౌర విమానాల శాఖను ఇచ్చే అవకాశం ఉంది. తన సొంత పార్టీ లోకసభ సభ్యుల నుంచి కూడా కాంగ్రెసు నాయకత్వంపై ఒత్తిడి ఉంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలు మంత్రివర్గంలో ఎక్కువ కోటాను ఆశిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+