ర్యాగింగ్ ను అరికట్టండి: వైయస్
ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాజేంద్రనగర్లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో శుక్రవారం రాష్ట్రస్థాయి వైస్ ఛాన్సలర్ల సదస్సును రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రంగా వర్శిటీ భాగస్వామ్యంతో నిర్వహించింది. రాష్ట్రంలోని 32 విశ్వవిద్యాలయాల నుంచి వైస్ఛాన్సలర్లు, ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.ఈ సదస్సుకు వ్యవసాయ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, ఉన్నత విద్యాశాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా హాజరయ్యారు. విశ్వవిద్యాలయంలో విద్య, పరిశోధనలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైస్ చాన్సలర్ల సదస్సులో వైఎస్ చర్చించారు.
Comments
Story first published: Friday, June 12, 2009, 14:02 [IST]