ర్యాగింగ్ ను అరికట్టండి: వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌:కళాశాలల్లో ర్యాగింగ్ ను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వైస్ చాన్సలర్లకు సూచించారు. ర్యాగింగ్ వల్ల జరిగే అవాంఛనీయ సంఘటనలకు అధికారులే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. వైస్ చాన్సలర్ల సమావేశంలో ఆయన శుక్రవారం మాట్లాడారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యత కొరవడుతోందని ఆయన అన్నారు. యుజిసి స్కేళ్ల వర్తింపును పరిశీలించేందుకు కమిటీ వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇవ్వలేకపోయారు.

ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో శుక్రవారం రాష్ట్రస్థాయి వైస్‌ ఛాన్సలర్ల సదస్సును రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రంగా వర్శిటీ భాగస్వామ్యంతో నిర్వహించింది. రాష్ట్రంలోని 32 విశ్వవిద్యాలయాల నుంచి వైస్‌ఛాన్సలర్లు, ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.ఈ సదస్సుకు వ్యవసాయ శాఖ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి, ఉన్నత విద్యాశాఖ మంత్రి శ్రీధర్‌ బాబు కూడా హాజరయ్యారు. విశ్వవిద్యాలయంలో విద్య, పరిశోధనలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైస్‌ చాన్సలర్ల సదస్సులో వైఎస్‌ చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+