ప్రతిఘటన రాష్ట్ర కార్యదర్శి అశోక్ హతం
వరంగల్: వరంగల్ జిల్లాలో పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్ లో బుధవారం ప్రతిఘటన గ్రూప్ రాష్ట్ర కార్యదర్శి అశోక్ అలియాస్ సుధాకర్ హతమయ్యాడు. అతనితో పాటు మరో ఇద్దరు నక్సలైట్లు కూడా ఈ ఎన్ కౌంటర్లో మరణించారు. వరంగల్-కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో గల భూపతిపూర్ వద్ద ఈ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు గాలింపు చర్యలు జరుపుతుండగా నక్సలైట్లు తారసపడ్డారని, ఈ సమయంలో ఎన్ కౌంటర్ జరిగిందని వరంగల్ జిల్లా ఎస్పీ సజ్జనార్ చెప్పారు.
అశోక్ స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని బయ్యారం మండలం ఇర్సులాపురం. మృతుల్లో మేడారం దళ కమాండర్ చంద్రన్న ఉన్నట్లు తెలుస్తోంది. మరొకరి గుర్తింపు తెలియడం లేదు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక ఎస్ ఎల్ ఆర్ రైఫిల్ ను, 8 ఎంఎం తుపాకిని, మూడు సంచులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రతిఘటన కనుమరుగైనట్లేనని సజ్జనార్ అన్నారు. సంఘటనా స్థలంలో గాలింపును ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications