ప్రతిఘటన రాష్ట్ర కార్యదర్శి అశోక్ హతం
వరంగల్: వరంగల్ జిల్లాలో పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్ లో బుధవారం ప్రతిఘటన గ్రూప్ రాష్ట్ర కార్యదర్శి అశోక్ అలియాస్ సుధాకర్ హతమయ్యాడు. అతనితో పాటు మరో ఇద్దరు నక్సలైట్లు కూడా ఈ ఎన్ కౌంటర్లో మరణించారు. వరంగల్-కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో గల భూపతిపూర్ వద్ద ఈ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు గాలింపు చర్యలు జరుపుతుండగా నక్సలైట్లు తారసపడ్డారని, ఈ సమయంలో ఎన్ కౌంటర్ జరిగిందని వరంగల్ జిల్లా ఎస్పీ సజ్జనార్ చెప్పారు.
అశోక్ స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని బయ్యారం మండలం ఇర్సులాపురం. మృతుల్లో మేడారం దళ కమాండర్ చంద్రన్న ఉన్నట్లు తెలుస్తోంది. మరొకరి గుర్తింపు తెలియడం లేదు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక ఎస్ ఎల్ ఆర్ రైఫిల్ ను, 8 ఎంఎం తుపాకిని, మూడు సంచులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రతిఘటన కనుమరుగైనట్లేనని సజ్జనార్ అన్నారు. సంఘటనా స్థలంలో గాలింపును ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications