వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
'వైఎస్పై జెపి ఎందుకు నిలబెట్టలేదు?'
హైదరాబాద్: వైఎస్ పైన, కుమారుడు జగన్పైనా గత ఎన్నికల్లో ఎందుకు పోటీ పెట్టలేదో లోక్సత్తా సమాధానం చెప్పాలని టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు డిమాండ్ చేశారు. అవసరమైతే టీడీపీ ఆడిట్ నివేదికలు 1983 నుంచి లోక్సత్తాకు పంపిస్తామన్నారు. ప్రజా వ్యతిరేఖ విధానాలపై జేపీ కాంగ్రెస్ను ఎందుకు విమర్శించటం లేదని తాము ప్రశ్నించటంలో తప్పులేదని ఆయన చెప్పారు. పత్రికలో వచ్చిన కథనాలపై సవాళ్లును బహిరంగ సవాళ్లు అక్కర్లేదన్న ఎర్రన్నాయుడు ఆరోపణలొస్తే... నిరూపించుకోవాలని హితవు పలికారు. పార్టీ ఆర్భాటాలకూ, ప్రచారాలకూ డబ్బు ఏవిధంగా వచ్చిందని ఎవరడిగినా అందులో తప్పేమీ లేదని స్పష్టంచేశారు
Comments
Story first published: Sunday, July 5, 2009, 18:33 [IST]