డబ్బిస్తామన్న వారితో కేసీఆర్ ...
హైదరాబాద్: పొత్తుల కోసం తెదేపా, ప్రరాపాలతో చర్చలు జరిపి ఎక్కువ డబ్బిస్తామన్న వారితో అంగీకారం కుదుర్చుకున్నారని జిట్టా బాలకృష్ణరెడ్డి విమర్శించారు.తెరాస అధినేతపై అసమ్మతి గళం వినిపించి పార్టీ నుంచి సస్పెండైన జిట్టా బాలకృష్ణరెడ్డి మరోసారి కేసీఆర్పై విరుచుకుపడ్డారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన కేసీఆర్ తిథులు, ముహుర్తాల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప ప్రజల సమస్యల్ని, ఆకాంక్షల్ని విస్మరించారని దుయ్యబట్టారు. చంద్రశేఖర్, రవీంద్రనాయక్ వంటి నేతల్ని ఆర్థిక ప్రలోభాలు చూపి తిరిగి పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. ప్రజల్లో విశ్వాసం కల్గించలేకే ఎన్నికల్లో ఓడిన విషయాన్ని ఒప్పుకోకుండా ఇతర పార్టీలపై నెట్టివేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న అధినేత వైఖరికి నిరసనగా తెరాసకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జిట్టా పాటు నల్గొండ జిల్లా నేతలు కొందరు పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.
-
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications