వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మెట్రో రైల్వే ఛైర్మన్ రాజీనామా
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైల్వే ఛై ర్మన్ శ్రీధరన్ ఆదివారం రాజీనామా సమర్పించారు. ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశానని శ్రీధరన్ తెలిపారు. రాజీనామా లేఖను ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్కు అందజేశారు. ప్రమాదం తనను ఎంతో బాధించిందని ఈ సందర్భంగా శ్రీధరన్ వెల్లడి చేశారు. ప్రమాద సమయంలో 30 మంది పనిచేస్తున్నారని చెప్పారు. ప్రమాదం కారణంగా రూ. 6 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని శ్రీధరన్ తెలిపారు. నిర్మాణంలో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫ్లైఓవర్ ఫిల్లర్ ఆదివారం ఉదయం కూలిన సంగతి విదితమే. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో పది మందికి గాయాలయ్యాయి.
Comments
Story first published: Sunday, July 12, 2009, 16:58 [IST]