వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజధాని ఎక్స్ప్రెస్ లో భారీ దోపిడి
వరంగల్: బోలాసా నుంచి ఖాజీపేటకు వస్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ లో దారి దోపిడి జరిగింది. మొత్తం నాలుగు బోగిల్లో దుండగులు దోపిడి చేశారు. దాదాపుగా రూ.50 లక్షల సొత్తును దోచుకున్నారు. దోపిడీ జరిగిన సమయంలో రైల్వే పోలీసులు ఒక్కరు కూడా లేరు. అయితే తాము ఫిర్యాదు చేసినా నాగ్ పూర్ పోలీసులు స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దాదాపు 10-15 మంది దాకా దోపిడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దోపిడి జరిగిన నాలుగు బోగీలే. దోపిడి జరిగిన మాటే నిజమేనని రైల్వే అధికారులు వెల్లడించారు. ఖాజీపేట చేరుకున్న బాధితులను ఎంపీ రాజయ్య పరామర్శించారు.
Comments
Story first published: Saturday, July 18, 2009, 18:01 [IST]