వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుంటూరు జిల్లాలో బాంబు దాడులు
గుంటూరు: గుంటూరు జిల్లా బాంబు దాడులతో అట్టుడుకుతోంది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం జంగాలపల్లి గ్రామంలో ఇరు వర్గాల మధ్య మంగళవారం బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు. గ్రామంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నాలుగు బకెట్ల బాంబులను వారు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Story first published: Tuesday, July 28, 2009, 11:03 [IST]