హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ: ప్రతిపక్షాల వాకౌట్

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపులపై ప్రతిపక్షాలు మంగళవారం శాసనసభ నుంచి వాకౌట్ చేశాయి. పౌర సరఫరాల మంత్రి జూపల్లి కృష్ణారావు ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందని తెలుగుదేశం, మజ్లీస్, బిజెపి, సిపిఎం, సిపిఐ, తెరాస సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆర్టీసికి సరఫరా చేస్తున్న డీజిల్ పై పన్ను తగ్గించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అందుకు జూపల్లి కృష్ణారావు తిరస్కరించారు. దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు మన రాష్ట్రంలోనే అధికంగా ఉన్నాయని, ప్రభుత్వానికి ఆర్టీసిపై లేని ప్రేమ విమానాలపై ఉందని అంతకు ముందు ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. పెట్రో ధరలపై అమ్మకం పన్ను తగ్గించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దేశంలో ఎక్కడా లేనంత అమ్మకం పన్ను మన రాష్ట్రంలో ఉందని అన్నాయి.

ఆర్టీసిపై ఎవరికి ప్రేమ ఉందో సిబ్బందిని అడిగితే చెప్తారని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. పన్నులు తగ్గించి తాము ఆర్టీసి బతికించామని ఆయన అన్నారు. 12 శాతం వంటగ్యాస్ పన్నును నాలుగు శాతానికి తగ్గించామని ఆయన చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయం మూతపడే పరిస్థితి వచ్చిందని,అందుకే ఏవియేషన్ ఫ్యూయెల్ పై పన్ను తగ్గించామని ఆయన వివరణ ఇచ్చారు. ఆర్టీసికి పూర్తి సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వ తమదేనని ఆయన అన్నారు. తాము ఆదుకోకపోతే ఆర్టీసి టైర్లు, ట్యూబులు కూడా అమ్ముకునే వారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X