రోశయ్య పద్దు నచ్చలేదు: చిరు

Chiranjeevi
హైదరాబాద్: శాసనసభలో ఆర్థిక మంత్రి కె.రోశయ్య ప్రతిపాదించిన బడ్జెట్ పై ప్రజారాజ్యం పక్ష నాయకుడు చిరంజీవి పెదవి విరిచారు. రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర నిర్వహణకు కుటుంబ పెద్ద కుటుంబ నిర్వహనకు వేసుకునే జమాఖర్చుల లెక్కలాగా, పద్దులాగా ఉండాలని, కానీ రోశయ్య బడ్జెట్ అలా లేదని ఆయన అన్నారు. బడ్జెట్ అంచనాలు వాస్తవ దూరంగా ఉన్నాయని ఆయన అన్నారు. అప్పు చేసి పప్పు కూడు అన్నట్లుగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం బేషజాలకు పోయినట్లుగా ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం పప్పు కూడా అందుబాటులో లేదని ఆయన అన్నారు. బడ్జెట్ పై చర్చలో ఆయన మంగళవారం పాలు పంచుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆయన తప్పు పట్టారు. ఆరోగ్య శ్రీ పేరుతో ప్రభుత్వం కార్పోరేట్ ఆస్పత్రులకు దోచిపెడుతోందని ఆయన విమర్శించారు. దీనివల్ల ప్రభుత్వాస్పత్రులు 20 శాతం లాభపడితే కార్పోరేట్ ఆస్పత్రులు 80 శాతం లాభపడుతున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జ్వరం మాత్రలు తప్ప ఏమీ ఉండవని ఆయన అన్నారు.

అసంబద్ధమైన పథకాలతో రాష్ట్ర ఆర్థిక రంగం అస్తవ్యస్తంగా మారిందని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. వృద్ధిరేటును అదుపులో ఉంచకపోతే అంధకారం తప్పదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం రుణగ్రస్తులను చేస్తోందని ఆయన విమర్శించారు. వనరుల వ్యయాన్ని, అపరిమిత వృధాను అరికట్టాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రజలతో మద్యం సాధ్యమైనంత ఎక్కువ తాగించేందుకు కంకణం కట్టుకుందని ఆయన విమర్శించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయానికి ప్రలోభ పడి తాగించడాన్ని ఉద్యమంలా చేపట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. దానివల్లనే బెల్టు షాపులు పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. విద్యుత్ సబ్సిడీలు ఇలాగే కొనసాగితే తలకు మించిన భారమవుతాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+