విపక్ష సభ్యుల సస్పెన్షన్
హైదరాబాద్: సభా కార్యక్రమాలను అడ్డుకున్న ప్రతిపక్షాల సభ్యులను శాసనసభ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), సిపిఎం, సిపిఐ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. సస్పెన్షన్ అనంతరం కూడా బయటకు వెళ్లకపోవడంతో సభ్యులను మార్షల్స్ తో బయటకు పంపించారు. సస్పెన్షన్ అనంతరం ప్రతిపక్షాల సభ్యులు శాసనసభ ముందు ధర్నాకు దిగారు. వారి సస్పెన్షన్ కు శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య తీర్మానం ప్రతిపాదించారు. 80 మంది శాసనసభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.
ఓబుళాపురం గనుల లీజు వ్యవహారంపై సభా సంఘం వేయాలని పట్టుబడుతూ ప్రతిపక్షాల సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపైనే పది నిమిషాల పాటు సభ వాయిదా పడి తిరిగి సమావేశమైన తర్వాత కూడా సద్దుమణగలేదు. తెలుగుదేశం, తెరాస సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు. అడ్వొకేట్ జనరల్ ను సభకు పిలిపించి సభా సంఘం వేయడానికి వీలవుతుందా లేదా అనే విషయాన్ని కనుక్కోవాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, బిజెపి శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications