14కు పెరిగిన స్వైన్ ఫ్లూ మృతులు

స్వైన్ ఫ్లూ వ్యాధికి తీవ్రంగా దెబ్బ తిన్న నగరం మహారాష్ట్రలోని పూణే. పూణేలో శ్రుతి గవాడే అనే 13 ఏళ్ల బాలిక మరణించింది. దక్షిణ ముంబైలోని బైకుల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో సయీదా దోర్హీవాలా అనే 63 ఏళ్ల మహిళ మరణించింది. ముంబైలో షాహిదా వార్సీ అనే బాలిక ప్రైవేట్ ఆస్పత్రిలో మృత్యువాత వడింది.తాజాగా బుధవారం మహారాష్ట్రలోని నాసిక్ లో స్వైన్ ఫ్లూతో ఒక వైద్యుడు మరణించాడు. డాక్టర్ రూపేష్ గాంగుర్దే సోమవారం నాసిక్ ఆస్పత్రిలో చేరాడు. అతను బుధవారం మరణించాడు. పూణేలో శ్రావణి దేశ్ పాండే అనే 29 ఏళ్ల మహిళ మరణఇంచింది. 35 ఏళ్ల సంజయ్ మిస్త్రీ మరణించిన రెండు గంటలకే ఆమె మృత్యువాత పడింది.












Click it and Unblock the Notifications