అసెంబ్లీ నుంచి ఎర్రబెల్లి సస్పెన్షన్

సభా సంప్రదాయాలను కాపాడి సభనుంచి వెళ్లిపోవాలని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి దయాకరరావును ఆదేశించారు. దయాకర రావు వెళ్లిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వారికి మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని, సస్పెండ్ అయిన సభ్యుడు సభలో ఉండగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం సంప్రదాయం కాదని స్పీకర్ అన్నారు. తెలుగుదేశం నిరసనల మధ్య సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. వ్యక్తిగతంగా శాసనసభ్యుడిగా దయాకరరావును సస్పెండ్ చేసినట్లు, పార్టీ తరఫున కాదని స్పీకర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications