ఎర్రబెల్లి గొంతు వింటే భయం: సిఎం

YS Rajasekhar Reddy
హైదరాబాద్: తెలుగుదేశం సభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావుపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేయాలని, ఎర్రబెల్లి దయాకరరావు సస్పెన్షన్ ను ఉపసంహరించాలని ప్రతిపక్షాల నాయకులు చేసిన విజ్ఞప్తికి ఆయన బుధవారం శాసనసభలో ప్రతిస్పందించారు. ఎర్రబెల్లి దయాకర రావుది బెదిరింపు గొంతు అని, ఎర్రబెల్లి మాట వింటే తమ గుండెల్లో రైళ్లు పెరిగెడతాయని ఆయన అన్నారు. ఆయన హావభావాలను కూడా ముఖ్యమంత్రి తప్పు పట్టారు. ఎర్రబెల్లి దయాకరరావు కూర్చునే పద్ధతి కూడా సరిగా ఉండదని ఆయన అన్నారు. ఈ సమయంలో ఎవరో ఏదో వ్యాఖ్య చేశారు. దానికి ముఖ్యమంత్రి ప్రతిస్పందిస్తూ తాను మర్యాదగానే కూర్చుంటానని అన్నారు.

కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను తాను గమనిస్తున్నానని, ఎన్నడూ జరగని సంఘటనలు ప్రస్తుతం సభలో జరుగుతున్నాయని ఆయన అన్నారు. రా, బయటకు రా, చూసుకుందాం అని దయాకరరావు అన్నట్లు ఆయన చెప్పారు. దయాకరరావుతో బేషరతుగా క్షమాపణ చెప్పిస్తే తాను విచారం వ్యక్తం చేస్తానని ఆయన చెప్పారు. కొన్ని పద్ధతులు పాటించకపోతే సభను నడుపుకోవడం సాధ్యం కాదని ఆయన అన్నారు. తాను ఏకవచనంలో మాట్లాడనని చంద్రబాబు అంటున్నారని, తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, రౌడీలా మట్లాడుతున్నావు, ఏంటయ్యా అనవసర రాద్ధాంతమని మాత్రమే తాను అన్నానని, అయ్యా అంటే తప్పు కాదని, అది గౌరవించడమేనని ముఖ్యమంత్రి వివరించారు. సభ్యుల ప్రవర్తనతో సభ నడుపుకోలేనప్పుడు వారిని సస్పెండ్ చేయడం తప్పు కాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+