వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దొడ్డు బియ్యం తిన్న వైయస్ జగన్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
కడప: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, కడప లోకసభ సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం దొడ్డు బియ్యం అన్నం తిన్నారు. తన చిన్నాన్న, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ వివేకానంద రెడ్డితో కలిసి ఆయన కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో దొడ్డు బియ్యం అన్నం తిన్నారు. ధరల నియంత్రణకు, ఆరోగ్యానికి దొడ్డు బియ్యం అన్నం తినడమే మందని, తాను దొడ్డు బియ్యం అన్నమే తింటున్నానని ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి దొడ్డు బియ్యం అన్నం తిన్నారు.

కాగా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డి బుధవారం నామినేషన్ వేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఇతర నేతలతో కలిసి వచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్లమెంటుకు పోటీ చేయడానికి వీలుగా గత ఎన్నికల్లో వైయస్ వివేకానందరెడ్డి తప్పుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X